జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చంద్రయాన్ విజయోత్సవ సంబరాలు


స్వేచ్ఛ న్యూస్, ఆగస్టు 23, నార్కెట్ పల్లి: ప్రపంచ చరిత్రలో ఏ దేశానికి సాధ్యం కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ భారతదేశం  చంద్రయాన్ 3 మిషన్ ని చంద్రుని దక్షిణ ధ్రువం పై సాఫ్ట్ లాండింగ్ ద్వారా విజయవంతంగా శాటిలైట్ ను ప్రవేశపెట్టి ప్రపంచ దేశాలకు భారత్ తన సత్తాను చాటిన వేళ ఆ మధుర క్షణాలను పురస్కరించుకొని నల్గొండ జిల్లా, నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలో జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అమ్మనబోలు చౌరస్తా నుండి మునుగోడు చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జనగణమన చౌక్ (నల్లగొండ చౌరస్తా) వద్ద జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించి, టపాకాయలు కాల్చారు, మిఠాయిలు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి అధ్యక్షులు కన్నెబోయిన నరసింహ, సభ్యులు నోముల నాగరాజు, గోదల వెంకటరెడ్డి, భాషెట్టి శ్రీనివాస్, శ్రీపతి గణేష్, బండారు రమేష్, పల్లెర్ల నాగరాజు,  గూడూరు అంజిరెడ్డి, జాల వెంకన్న, మునుకుంట్ల గణేష్, రాధారపు బిక్షపతి, శేఖర్, మునుకుంట్ల శ్రీను, నల్లగొండ నాగరాజు, మిట్ట శేఖర్ రెడ్డి, లోకసాని శేఖర్ రెడ్డి, అలుగుబెల్లి దామోదర్ రెడ్డి, పల్లెర్ల సత్యనారాయణ, శ్రీనివాస్, బైరోజు సతీష్, జాల రమేష్, బైరోజు రవి, రాము, బద్దుల బిక్షం, పసునూరి సంపత్, కంచర్ల బాబురావు,  పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

చంద్రయాన్ విజయవంతమైన సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తూ తమ దేశభక్తిని చాటుతున్న నార్కట్పల్లి ప్రజలు
పట్టణ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న జనగణమన ఉత్సవ సమితి సభ్యులు
Share this…

క్షణ కాలాన్ని తర తరాలపాటు చూపించేది ఫోటోగ్రఫీ

స్వేచ్చ న్యూస్, నార్కట్పల్లి, ఆగస్టు 19: క్షణ కాలాన్ని బంధించి భవిష్యత్ తరాలకు అప్పటి జ్ఞాపకాన్ని చూపించేది ఛాయాచిత్ర కళ అని నార్కెట్పల్లి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నెబోయిన నరసింహ పేర్కొన్నారు. శనివారం 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నార్కెట్పల్లి మండల సంగం ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం పట్టణ కేంద్రంలో మునుగోడు రోడ్డు నుంచి అమ్మనబోలు రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో మధుర క్షణాలను జ్ఞాపకాలుగా మలిచి భవిష్యత్తుకు అందించి అలనాటి స్మృతులను కళ్ళ ముందు ఉంచడం ఒక్క ఫోటోగ్రఫీ రంగానికే సాధ్యమని తెలిపారు. ప్రపంచంలో అందరూ నవ్వుతూ ఉండాలని కోరుకునే ఒకే ఒక నిస్వార్థ వ్యక్తి ఫోటోగ్రాఫర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గౌరీదేవి నరసింహ, కోశాధికారి నీలం శివరాం, జిల్లా ప్రచార కార్యదర్శి కొమ్ము గిరి, నాయకులు సోమ వెంకటరెడ్డి, తిరుమల్ సతీష్, వెంకన్న, లింగస్వామి, సురేష్, శ్రీమాన్, మల్లేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Share this…

అత్యవసరం అయితే ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళాలి ప్రభుత్వ ఆసుపత్రికి రావద్దన్న డాక్టర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 17: స్థానిక గోదావరిఖని హనుమాన్ నగర్ కు చెందిన బూడిద లక్ష్మీ అనే మహిళ ఇంట్లో కాలుజారి పడడంతో ఆమెను కుటుంబ సభ్యులు(గోదావరిఖని)రామగుండం జనరల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకువెల్లి ఆర్థోపెటిక్ డాక్టర్ ఉభే ఉల్లా ను సంప్రదించగా అతను దుర్భాషలాడుతూ బయటికి నెట్టేశారు పేషంట్ ఇబ్బందిని గుర్తించకుండా ఓపి రాయకుండా కనీసం గంటసేపు ఇబ్బందులకు గురి చేశారని అత్యవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళాలి కానీ ప్రభుత్వ ఆసుపత్రికి రావద్దన్నారని పేషెంట్ బంధువులు తెలిపారు. ఇలాంటి సిబ్బందిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పేషంట్ వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

Share this…

సింగరేణి బాయి బాట కార్యక్రమం నిర్వహించిన సోమారపు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 12: శనివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే,ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ నిర్వహించిన సింగరేణి భాయి బాట సందర్భంగా ఆర్జీ టు ఏరియా ఓసిపి త్రీ కార్మికులను,వర్క్ షాప్ కార్మికులను కలిసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుని మాట్లాడుతూ నన్ను మొట్టమొదటిసారిగా రామగుండం మున్సిపాల్ చైర్మన్గా గెలిపించారని మీ ఆశీర్వాదంతో గెలిచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం,సెవరేజి సిస్టం,అన్ని ఏరియాలలో సిసి రోడ్ల నిర్మాణం చేశానని,సింగరేణి కార్మికులకు,ప్రజలకు 24 గంటలు మంచి త్రాగునీటి సౌకర్యం కల్పించానని అన్నారు.రామగుండం నియోజకవర్గ ఇండిపెండెంట్ శాసనసభ్యునిగా నిలబడిన నన్ను సింగరేణి కార్మికులు,ప్రజలు గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు.నేను ఎన్నడు భూ కబ్జాలు,సెటిల్మెంట్లు,పోలీస్ ఫైరోగులు,గవర్నమెంట్ హాస్పిటల్ ఉద్యోగాలు,సింగరేణి ఓబి కాంట్రాక్ట్ ఉద్యోగాలు,మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగాలు,ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు లాంటి పేద ప్రజల రక్తాన్ని పిల్చే ఎలాంటి పైరవీలు నేను చేయలేదు ఆర్ ఎఫ్ సి ఎల్ ఉద్యోగాలు ఎన్నడూ అమ్ముకోలేదన్నారు.కొంతమంది ప్రజా నాయకులు ప్రజల,కార్మికుల అమయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఉద్యోగాల పేరిట మోసం చేశారని అన్నారు.ముఖ్యంగా మన భారతదేశానికి వెలుగులు నింపే సింగరేణి కార్మికులు సకలజనుల సమ్మె చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకై కృషిచేసి సాధించారన్నారు. సింగరేణి కార్మికులకు కార్మిక కుటుంబాలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.మళ్లీ నన్ను రామగుండం నియోజకవర్గ శాసనసభ్యునిగా గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ ముదిరాజ్,సోమవరపు లావణ్య అరుణ్ కుమార్,కార్పొరేటర్ మందల కిషన్ రెడ్డి,దుబాసి లలిత మల్లేష్,కోదాటి ప్రవీణ్,దీటి వెంకటస్వామి,మండల అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ గౌడ్,తోకల అనురాగ్, సింగరేణి కార్మికులు,బిజెపి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this…

గుడుంబా స్థావరాలు పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 12: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపెల్లి,మంచిర్యాల జోన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి ఐపీఎస్(డిఐజి)ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి మల్లారెడ్డి,ఇన్స్పెక్టర్లు అశోక్,సుధాకర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీమ్స్ గుడుంబా స్థావరాలు,ఇండ్లలో తనిఖీ చేసి గుడుంబా,బెల్లం పానకం గుర్తించి ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. ఈ తనిఖీలలో గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేకే నగర్ 8 ఇంక్లెన్ కాలనీ లోని అంజమ్మw/oచందు ఇంటి వద్ద ఆరు లీటర్ల గుడుంబా,40 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి కేసు నమోదు చేశారు.బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి జీడీ నగర్లో శివరాత్రి శంకర్ గుడుంబా తయారీకి నిల్వచేసిన 100 లీ. బెల్లం పానకం ధ్వంసం.ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో భానోత్ గంగారాం s/o రాజం నాయక్ గుడుంబా తయారీ కోసం దాచిన 25 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు.నెన్నేల్ పోలీస్ స్టేషన్ పరిధి గంగారం గ్రామంలోని ఉమ్మల మల్లేశ్వరిw/o కొమురయ్య ఇంటి వద్ద 44 ప్యాకెట్ల గుడుంబా,రత్నం పోచమల్లుs/oపోచం ఇంటి వద్ద 84 ప్యాకెట్ల గుడుంబా స్వాధీనం చేసుకుని వీరుపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి ఎవరు కూడా అక్రమంగా గుడుంబా తయారుచేసిన అమ్మిన,నాటు నాటు సారా తయారీకి ముడి సరుకులైన బెల్లము,పట్టిక రవాణా చేసిన,నిలువచేసిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన కట్టిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Share this…

సింగరేణి వారసత్వ ఉద్యోగాల కల్పనలో భారీ కుంభకోణం

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 12: సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగ కల్పనలో భారీ కుంభకోణం జరిగిందని డిసిసి అధ్యక్షులు రాజ్ ఠాకూర్ ఆరోపించారు.ఈ మేరకు గోదావరిఖని మార్కండేయ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా వారసత్వ ఉద్యోగాల పేరిట కొందరు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.వారసత్వ ఉద్యోగ కల్పనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పొందిన మహిళల పట్ల యజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.నిబంధనలకు విరుద్ధంగా మహిళా కార్మికులతో విధులు నిర్వహింప చేస్తున్నారని,సింగరేణిలో అనేక విభాగాలు ఉన్నప్పటికీ బొగ్గు వెలికితీత పనులను మహిళలతో చేయిస్తున్నారని అన్నారు.వెంటనే మహిళా ఉద్యోగులకు సముచిత పని స్థలాలలో పని కల్పించాలని డిమాండ్ చేశారు.మహిళా ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సమావేశంలో తెలిపారు.

Share this…

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు

స్వేచ్చ న్యూస్, రామగుండం, ఆగస్టు 12: ఈరోజు ఉదయం బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ బయట టాస్క్ ఫోర్స్ పోలీసులను గమనించిన వ్యక్తి పారిపోతుండగా గమనించి అతని పట్టుకొని తనిఖీ చేయగా చిన్న చిన్న ప్యాకెట్లలో సుమారు 500 గ్రాముల డ్రై గంజాయి లభించింది. అతనిని విచారించగా తన పేరు అనుదీప్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నివాసి అని తెలిపాడు. అతను చదువు మధ్యలో ఆపివేసి చెడు అలవాట్లకు బానిసై తను తాగడానికి,తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో మహారాష్ట్ర బల్లార్షాలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలోని అమాయక యువతకు ఎక్కువ రేటుకు అమ్ముతానని తెలపడం జరిగిందన్నారు. నిందితున్ని అతని వద్ద లభించిన గంజాయిని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కోసం బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించడం జరిగిందన్నారు.

Share this…

సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న రాజ్ ఠాకూర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 12: సింగరేణి కార్మికుల ఆశీర్వాద యాత్రలో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ ఆర్జీ వన్ ఏరియాలోని ఓసిపి ఫైవ్ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని,మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు.కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం చేస్తామని అన్నారు.రానున్న ఎన్నికలలో తనను గెలిపించి తనకు ఒక అవకాశం ఇవ్వాలని కార్మికులను కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్పొరేటర్లు,ఎస్సీ సెల్,బీసీ సెల్,మైనారిటీ,మహిళ,యువజన కాంగ్రెస్,ఎన్ ఎస్ యు ఐ నాయకులతో పాటుగా సోషల్ మీడియా వారియర్స్,సింగరేణి కార్మికులు,కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.

Share this…

అర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగుల పంపిణీ

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 9: పాలకుర్తి మండలంలోని పాలకుర్తి పాలకుర్తి మండలంలోని పాలకుర్తి,ఈసాల తక్కల్లపల్లి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి కందుల సంధ్యారాణి పాల్గొని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందించిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ఆధునికరిస్తూ నూతన విద్యా విధానాన్ని అవలంబిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తుందని అన్నారు.ప్రైవేటు పాఠశాల లకు దీటుగా డిజిటల్ విద్యను అందిస్తూందన్నారు.ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం సహకారంతోపాటు మనం కూడా ఆర్గనైజేషన్ ద్వారా విద్యార్థులకి సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి తమ వంతు సహకారం అందజేయాలన్న అర్ష ఫౌండేషన్ సభ్యులను అభినందిస్తున్నానన్నారు. ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు అందజేస్తున్న సహకారాన్ని విద్యార్థులు వినియోగించుకొని బాగా చదివి మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని అని అన్నారు.ఈ కార్యక్రమంలో హర్ష ఫౌండేషన్ నిర్వాహకుడు బూడిద హర్ష,ప్రధానోపాధ్యాయులు వి సత్యనారాయణ రెడ్డి,కే శ్రీనివాస్,ఉపాధ్యాయులు సత్యనారాయణమూర్తి,నరసయ్య,రవీందర్,భరత్ కుమార్,శిరోమణి,స్వరూప రాణి,నీలం రాణి తదితరులు పాల్గొన్నారు.

Share this…

సింగరేణి ప్రైవేట్ పరం కానివ్వం

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 9: సింగరేణి కార్మికుల ఆశీర్వాద యాత్రలో భాగంగా పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ బుధవారం ఉదయం ఆర్ జీ వన్ ఏరియా పరిధిలోని టు ఇంక్లైన్ గని,వర్క్ షాప్ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని,సింగరేణిని ప్రైవేట్ పరం కానివ్వమని తెలిపారు.సింగరేణి యజమాన్యం బోగ్గు ఉత్పత్తితోపాటు కార్మికులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.రానున్న ఎన్నికలలో తనకు ఒక అవకాశం ఇవ్వాలని కార్మికులను కోరారు.ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి,కార్పోరేటర్లు మహంకాళి స్వామి,ఎండి ముస్తఫా,నాయకులు తాళ్లపల్లి యుగంధర్,కొప్పుల శంకర్,నాయని ఓదేలు,దూళికట్ట సతీష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this…