రామగుండం ప్రజలు సుభిక్షంగా ఉండాలని దర్గాలో, బీరప్ప గుడిలో ప్రార్ధనలు చేసిన చందర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 31: రామగుండం నియోజకవర్గంలోని ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం ఉండాలని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ బుధవారం రామగిరి మండలం బేగంపేట నవాబుపేట పీర్ పహాడ్ దర్గా బాబాకు పూల ప్రసాదాలతో పాటు చాదార్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 14వ డివిజన్లోని లక్ష్మీపురం బీరప్ప స్వామి వారి పట్నాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవంతుని నమ్ముకున్న వారికి అంతా మంచే జరుగుతుందని రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని అందుకు ప్రజలకు,తనకు భగవంతుడు బీరప్ప,బాబా ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉంటాయని తాను 27 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామిమాల ధరించి ఆ భగవంతుని సన్నిధిలో గడుపుతున్నానని అన్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన ఈ కార్యక్రమలలో నాయకులు కెక్కెర్ల రాజ్ కుమార్,ఈదునూరి శ్రీకాంత్,ఇదునూరి కిరణ్ కుమార్,నారాయణ గౌడ్, విజయమ్మ ఫౌండేషన్ సభ్యులు సిద్ధార్థ,కార్పొరేటర్ నీల పద్మ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటివరకు నాకు సహాయం చేయడానికి ఎవరూ రాలేదు మీరోచ్చారు: సర్వర్ చాచా
స్వేచ్ఛ న్యూస్ రామగుండం మే 30: అబితక్ హమారా పరివార్పే కోయి బి ఇత్న మొహబ్బత్ నహి దికాయ! హమారాకో మద్దత్ కర్నే కే లియే ఆప్ హమారే ఘర్ ఖుద్ ఆయే! అంటూ ఉద్వేగ భరితమైన ఆనందభాష్పాలతో కన్నీటి పర్యంతమయ్యాడు సర్వర్ చాచా. వివరాల్లోకి వెళితే అంతర్గాం మండలం మురుమూరు గ్రామానికి చెందిన సర్వర్-అమినాబి దంపతులకు ఒక్కగానొక్క కూతురు రెహనా బేగంకు మంచిర్యాల జిల్లా లక్షట్ పేట మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ఇబ్రహీంకిచ్చి వివాహం చేశారు. ప్రభుత్వ సహాయం కోసం షాది ముబారక్ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఒక లక్ష 116 రూపాయల విలువగల చెక్కును రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే కోరకంటి చందర్ మంగళవారం రోజున స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఇచ్చారు. ఎమ్మెల్యే స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఒక్క లక్ష 116 రూపాయల విలువ గల చెక్కును ఇవ్వడంతో ఉద్వేగానికి గురైన సర్వర్ కళ్ళ నుండి ఆనందభాష్పాలు రాలుతుండగా ఇప్పటిదాకా మా కుటుంబం పై ఇంత ప్రేమను చూపెట్టిన వారు లేరని నువ్వు స్వయంగా మా ఇంటికి వచ్చావా అంటూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపగా సర్వర్ భుజం తట్టి ఓదార్చారు.
ఉద్యోగాలు,ఇసుక,బూడిద అమ్ముకునే తప్ప అభివృద్ధి ఎక్కడుంది ఠాగూర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 30: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్లో మంగళవారం రోజున రజిత,శోభలు ఏర్పాటు చేసిన మహిళ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ వారి సతీమణి మనాలి ఠాగూర్ ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గ సమస్యలపై ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న నన్ను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఓసిపిలతో బొందల గడ్డలు అవుతాయని ఓసిపి కాకుండా కుర్చీ వేసుకుని ఓసిపి కాకుండా అడ్డుకుంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ఓసిపిని చేసి గోదావరిఖని ప్రాంతాన్ని బొందలగడ్డగా మారుస్తున్నారని ఆరోపించారు.ఉద్యోగాలు,ఇసుక,బూడిద అన్ని అమ్ముకోవడమే తప్ప రామగుండం నియోజకవర్గ అభివృద్ధి చేయడంలో రామగుండం శాసనసభ్యులు విఫలమయ్యారని ఆరోపించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజలను ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
38 డివిజన్ సమస్యను పరిష్కరించమన్న ఠాగూర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 30: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్లో డ్రైనేజీ ప్రాబ్లం వల్ల ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ కు తెలపడంతో వెంటనే 38వ డివిజన్ ను సందర్శించి సమస్యలను పరిశీలించి మున్సిపల్ కమిషనర్ తో సమస్య తొందరగా పరిష్కారమయ్యేలా చూడాలని మాట్లాడి 38 డివిజన్ ప్రజలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జి మేకల పోశం,కిరణ్, చిల్ల పోశం, మెటం సారయ్య,చిల్ల లక్ష్మణ్,మహంకాళి,కుమార్,సమ్మయ్య,చెల్లయ్య,శివకుమార్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 30: అంతర్గాం మండల పరిధిలోని గోలివాడ ఐకెపి కేంద్రాన్ని మంగళవారం రోజున రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ పరిశీలించి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకలితీర్చే అన్నదాతగా పేరుగాంచిన రైతన్నలకు సీఎం కేసీఆర్ సంక్షేమ ప్రణాళికను రూపొందించి అకడ్బందీగా అమలు చేస్తూ అండగా నిలుస్తారన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని రైతులు పండించిన ప్రతి వరిగింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతే రాజుగా పాలనసాగిస్తూ కెసిఆర్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో రైస్ మిల్లర్లు ఎటువంటి కోత లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ఋతుపవనాలు రానుండడంతో అధికారులు ధాన్యం తరలింపులో ఎటువంటి అలసత్వం వహించకూడదని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ధరణి రాజేష్,బాధరవేణి స్వామి, బండారి ప్రవీణ్ కో ఆప్షన్ మెంబర్ గౌస్ పాషా మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి నాయక్ నాయకులు కోల సతీష్ గౌడ్,నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
డివిజన్లలో పాదయాత్ర చేస్తున్న ఠాగూర్ సతిమని
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 28: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని పలు డివిజన్లలో పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ సతీమణి మనాలి ఠాగూర్ పాదయాత్ర చేస్తూ ప్రజల యోగక్షేమలు,వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని వారిని కోరారు.