రికవరీ సెల్ ఫోన్ లను అప్పగించిన సీపీ రేమా రాజేశ్వరి

  1. రికవరీ సెల్ ఫోన్ లను అప్పగించిన సీపీ రేమా రాజేశ్వర రామగుండం పెద్దపెల్లి జిల్లా ఏప్రిల్ 24/ స్వేచ్ఛ న్యూస్: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో మొబైల్ ఫోన్ లను పోగొట్టుకున్న వారి ఆధార్ నెంబర్ ఫోన్ ఐ.ఎం.ఈ.ఐ నెంబర్లను సి.ఈ.ఐ.ఆర్ పోర్టల్ ద్వారా www.ceir.gov.in వెబ్సైట్లోకి లాగి అయి అప్లోడ్ చేయగా మొబైల్ ఫోన్ లను బ్లాక్ చేసి వాటి డీటెయిల్స్ లోకి వెళ్లి సిమ్ కార్డ్ వేసిన వారి వివరాల్లోకి వెళ్లి 5 ఫోన్ల వివరాలు రామగుండం సైబర్ క్రైమ్ కు తెలుపగా అట్టి ఫోన్లను ట్రేస్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లకు వివరాలు అందించారు. అందించిన వివరాల ప్రకారం మొబైల్ ఫోన్లను రికవరీ చేసి ఈరోజు సి.పి కార్యాలయంలో సి.పి రేమా రాజేశ్వరి బాధితులకు వారి మొబైల్స్ ను అందించారు.ఈ సందర్భంగా సిపి రేమా రాజేశ్వరి మాట్లాడుతూ ఎవరైనా వారి మొబైల్స్ ను పోగొట్టుకున్నట్లయితే వారు సి.ఈ.ఐ.ఆర్ పోర్టల్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్లి వారి నెంబర్లను www.ceir.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి వారి వివరాలను పొందుపరిచినట్లయితే వారి మొబైల్ ఫోన్లను పట్టుకోవడం సులభం అవుతుందని కావున ప్రజలు ఈ సి.ఈ.ఐ.ఆర్ అప్లికేషన్ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి డి.సి.పి వైభవ్ గైక్యాడ్,ఐ.పీ.ఎస్,పెద్దపల్లి ఏ.సి.పి ఎడ్ల మహేష్,జైపూర్ ఏ.సీ.పి నరేందర్,మంచిర్యాల ఏ.సి.పి తిరుపతిరెడ్డి,బెల్లంపల్లి ఏసిపి సదయ్య తదితరులు పాల్గొన్నారు.

0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *