అనార్తులకు కొండంత అండా కోరుకంటి
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 22: రామగుండం నియోజకవర్గం లోని అనార్తులకు నిరుపేదలకు కుండంత అండగా నిలుస్తున్నారు రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ ఆపద ఉందంటే తను ఉన్నానని భరోసానిస్తున్నారు గోదావరిఖని పట్టణంలోని విట్టల్ నగర్ కు చెందిన వృద్ధుడు రాగటి లక్ష్మయ్య ఆదివారం మృతి చెందాడు వృద్ధుని కుటుంబం నిరుపేద కావడంతో అంతక్రియలకు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆ విషయం తెలుసుకున్న రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ విజయమ్మ ఫౌండేషన్ బాధ్యులు సిద్ధార్థ ద్వారా ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుని అంత్యక్రియల కోసం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కోసమే విజయమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని ఫౌండేషన్ అధ్యక్షులు మణిదీప్ తెలిపారు. పేద వృద్ధుడి అంతక్రియలకు ఆసరాగా నిలిచిన ఫౌండేషన్ను కాలనీవాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ బాధ్యులు సిద్ధార్థ,శ్యామ్ సభ్యులు చొప్పదండి శ్రీకాంత్,కీసర లక్ష్మణ్,సంపత్,నరసయ్య పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!