రామగుండంలో గులాబీ జెండా ఎగురేసేందుకు కృషి చేయాలన్న చందర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 11:గోదావరిఖని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గత ఎన్నికల్లో పాలకుర్తి జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసిన ఫాతిమా,రామగుండం బిజెపి బీసీ మోర్చా అధ్యక్షుడు చుక్కల రాములు యాదవ్,బిజెపి సీనియర్ నాయకులు సమ్మిరెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరారు వారిని గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ప్రజలందరూ బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది మన బతుకులు మారాలంటే బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతాయని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వివరించి ప్రజలకు అవగాహన కల్పించి బిఆర్ఎస్ పార్టీకి గెలుపుకు అందరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు జిమ్మి బాబు,గోపు ఐలయ్య యాదవ్,జేవి రాజు కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!