తెలంగాణ లేబర్ పార్టీ అభ్యర్థి గొర్రె రమేష్ చర్చిల్లో ప్రార్థనలు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 12:ఆదివారం ఉదయం తెలంగాణ లేబర్ పార్టీ అభ్యర్థి గొర్రె రమేష్ తనను గెలిపించాలని గోదావరిఖనిలోని ఫైవ్ ఇంక్లైన్ ఏరియా లోని కృష్ణ నగర్లో కల్వరి గోస్పాల్ చర్చ్,గ్రేస్ గోస్పాల్ చర్చ్ బాపూజీ నగర్ లోని క్రీస్తు ఆలయ చర్చ్ ఎన్టీఆర్ నగర్ లోని ఆజాతే ఫుల్ గ్రేస్ ఫుల్ చర్చిలలో ప్రార్థనలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన రానున్న 30వ తారీకు అసెంబ్లీ ఎన్నికలలో రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయా పాస్టర్లను కోరారు. ఈ సందర్భంగా గొర్రె రమేష్ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి రమేష్ పాలనలో ప్రజలంతా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండాలంటే అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికై కృషి చేసే అవకాశం లభించాలని పాస్టర్లు దైవజనులు అంతా కూడా ఆయా చర్చిలలో ఏసుప్రభును ప్రార్థించి వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో గొర్రె రమేష్ శ్రీమతి గొర్రె లక్ష్మి,సెలిగంటి ఓదెలు,జక్కం కవిత,పెండ్లి కుమారి,గుండ్ల పోచం,జి అఖిల్ వర్మ,పాస్టర్లు,దైవజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *