మతోన్మాద ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ ప్రచార జాత

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద, ప్రైవేటీకరణ, అవినీతికి వ్యతిరేకంగా సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు ప్రచార జాతాను నిర్వహిస్తున్నట్టు బుధవారం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్ ,జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి పిలుపునిచ్చారు. నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాలలో ఏప్రిల్ 27 నుండి 30వ తేదీ వరకు ప్రచార జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కృష్ణా నదిలో తెలంగాణ వాటా తెల్ర్చకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ, బి వెల్లంల ప్రాజెక్టుని పూర్తి చేయాలని ధర్మారెడ్డి పెళ్లి, పిల్లాయిపళ్లి కాలువలను పూర్తి చేయాలని, మూసి కాలుష్యపు నీటిని శుద్ధి చేయాలని, దళిత బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి నిర్మాణం చేయాలని, ఇంటి స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని నల్గొండ పట్టణంలో డబల్ బెడ్ రూములు పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ జరిగే ప్రచార జాత నకిరేకల్, నల్గొండ నియోజకవర్గంలో ఇంటింటికి సిపిఐ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కరపత్రం రిలీజ్ చేసిన వారిలో సిపిఐ మండల కార్యదర్శి పెండ్యాల శంకర్, నార్కట్పల్లి పట్టణ కార్యదర్శి శ్రీపతి స్వామి, శిర బోయిన మల్లయ్య, దుబ్బ ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *