ముస్లిం మహిళల కోసం విజయమ్మ ఫౌండేషన్ ద్వారా 20 కుట్టు మిషన్ కేంద్రాలు ప్రారంభం
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే22: రామగుండం నియోజకవర్గం లోని పేద ముస్లిం మహిళల కోసం విజయమ్మ ఫౌండేషన్ ద్వారా 20 కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభిస్తున్నామని రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు కోరుకంటి చందర్ తెలిపారు. శాసనసభ్యులు ఆదేశాల మేరకు సోమవారం స్థానిక 42 వ డివిజన్ లో విజయమ్మ ఫౌండేషన్ వారి మహిళా సాధికారత కేంద్రంను మహిళ కోఆప్షన్ సభ్యురాలు తస్లీమా భాను ప్రారంభించారు. పేద ముస్లిం మహిళలల ఉపాధి కోసం విజయమ్మ ఫౌండేషన్ ద్వారా మహిళ సాధికారత కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేద ముస్లిం మహిళలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు కోరారు.ఈ కార్యక్రమంలో విజయమ్మ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఎడెల్లి శ్యామ్,సిద్దు,ట్రైనర్ మానస, నైమా బిల్కిస్,యాస్మిన్,సమీనా తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!