నకిలీ విత్తనాల రవాణాపై ప్రత్యేక నిఘా
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 21: రాష్ట్రంలో రైతుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు,రైతు బీమా, వ్యవసాయ రుణాలు వంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఈ తరుణంలో రైతులు నకిలీ విత్తన ముఠాల బారినపడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని, నకిలీ విత్తనాలు ,మద్యం స్మగ్లింగ్ ముఠపై ఉక్కు పాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం,రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, అంజనీ కుమార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు అప్రమత్తతతో సమాచారాన్ని సేకరించి కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. వానాకాలం సాగు చేయడానికి రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కొందరు ప్రయత్నం చేయడం జరుగుతుంది. వారిని అరికట్టేభాగంలో వ్యవసాయ శాఖ ఇంటలిజెన్స్ సిబ్బందితో కలిసి రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ బృందాలు రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిని గుర్తించి వారిపై నిఘా ఏర్పాటుచేసి సమాచారం సేకరించి వారిపై కఠినంగా చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాలోగల విత్తన,ఎరువుల దుకాణాలు,గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీచేసి అనుమానం వచ్చిన విత్తనాల శాంపిల్స్ లను సేకరించి వెంటనే పరీక్షలకు పంపించడం,రవాణా వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. లైసెన్సులు లేకుండా వ్యాపారం చేసేవారిపై,నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థల నుంచి విత్తనాలను వినియోగించేలా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. నకిలీ విత్తనాలు,మద్యం ఇతర రాష్ట్రాల నుండి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిగ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం అరికట్టేందుకు పోలీస్ ఎక్సైజ్ శాఖ,రైల్వే రవాణా శాఖ సంయుక్త సమన్వయంతో జిల్లాల సరిహద్దుల్లో నిగాపెంచడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అక్రమంగా రవాణాజరిగే ప్రాంతాలు మార్గాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం మొబైల్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయడంతోపాటు మద్యం అక్రమ రవాణా నిరోధించేందుకు ఇన్ ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయడం జరిగింది.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!