సీఎం సహాయనిధి పేదలకు అభయహస్తంగా నిలుస్తుందన్న కోరుకంటి
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 27: తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు సీఎం సహాయ నిధి కొండంత,భరోసాగా నిలుస్తుందని రామగుండం శాసనసభ్యులు కోరుకుంటి చందర్ అన్నారు. నరాల వ్యాధితో బాధపడుతున్న అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ కు 8 లక్షలు,రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని 48వ డివిజన్కు చెందిన గన్ను మాధవికి 2లక్షల 50 వేలు,31వ డివిజన్కు చెందిన పారిపల్లి లావణ్య 2లక్షల 50 వేలు,50వ డివిజన్కు చెందిన దేవేందర్ కు ఒక లక్ష రూపాయలు మొత్తంగా 14 లక్షల Loc చెక్కులను రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ స్వయంగా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి అందించి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య బారిన పడిన పేద ప్రజలకోసం ప్రభుత్వ సీఎం కేసీఆర్ సహాయనిది ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేదవారికి ముందస్తు శాస్త్రచిత్స నిమిత్తం ఎల్ ఓ సి ద్వారా ఆర్థిక సహాయం చేస్తుందని అన్నారు. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యునిగా నేను గెలిచిన నాటి నుండి దాదాపుగా 11 కోట్ల వరకు పేద ప్రజల వైద్యం కొరకు ఎల్ఓసి ద్వారా డబ్బులు మంజూరు చేసి అందించానన్నారు. రామగుండం నియోజకవర్గంలో పేదవారికి ఏ కష్టం వచ్చినా వారికి అండగా ఉంటున్నామని అన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!