రామగుండం నియోజకవర్గంలో పార్టీల పేరుతో వ్యక్తుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్న రమేష్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 13: రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలంగాణ లేబర్ పార్టీ అభ్యర్థి గొర్రె రమేష్ తనను గెలిపించాలని ఇందిరా నగర్ చౌరస్తా,సంజయ్ గాంధీనగర్,శాంతినగర్,లూర్దు నగర్ లో ప్రచారం నిర్వహించడం జరిగింది.ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో వ్యక్తుల పేరుతో,పార్టీల పేరుతో,హోదాల పేరుతో కొందరు వ్యక్తులు ప్రజల వద్దకు వచ్చి ఓట్ల కోసం మోసం చేస్తున్నారని ఆరోపించారు.ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న కోరికంటి చందర్, ఒకసారి చైర్మన్గా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న సోమారపు సత్యనారాయణ,మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయిన మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ గాని ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి అభివృద్ధి లేదని ఆరోపించారు.పదవుల ఆశతో ప్రజలకు డబ్బు,అభివృద్ధి ఆశ చూపుతూ మిమ్మల్ని మోసం చేస్తున్న నాయకులను ఓడించి బుద్ధి చెప్పాలని అన్నారు.నిరంతరం మీ అభివృద్ధికి పాటుపడే నాకు మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో చలిగంటి ఓదెలు,రామచంద్రయ్య,అఖిల్ వర్మ,జక్కం కవిత,పొన్నం రజిత,చలిగంటి ఓదెలు,అనుచరులు,తదితరులు పాల్గొన్నారు.

Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *