తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్న సత్యనారాయణ
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 30: స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన సోమారపు సత్యనారాయణ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నా క్రమంలో మాజీ కార్పొరేటర్ రవి నాయక్ సోమారపు గుడికి చేరారు.రామగుండం అభివృద్ధి చెందాలంటే నీతివంతమైన పాలన కావాలని అది కేవలం సత్యనారాయణకే సాధ్యమని తనకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులకు దీటుగా ప్రచారం నిర్వహిస్తూ ఈరోజు 8 ఇంక్లైన్ కాలనీలోని రాజీవ్ నగర్,లంబాడి తండా,తారక రామారావు నగర్, భాస్కర్ రావు నగర్ లో జరిగిన ప్రచారంలో ఆయనకు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నానని 8 ఇంక్లైన్ కాలనీ ప్రజలతో తనకు మంచి అవినావ సంబంధం ఉందని ఇక్కడ అభివృద్ధికి సింగరేణి తో మాట్లాడి అనేక రకాలైన అభివృద్ధి పనులు చేపట్టానని ఇప్పుడు మళ్లీ ఎలక్షన్లు వచ్చాయని తెలిపారు.పాపమని ఒకసారి అవకాశం ఇచ్చినందుకు ఐదు సంవత్సరాలు బాధపడ్డామని అవినీతి,భూకబ్జాలు,బెదిరింపులకు పాల్పడుతూ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారని అన్నారు.ఇప్పుడు కొత్తగా ఇంకొక వ్యక్తి ఒక ఛాన్స్ అంటూ ఎలక్షన్లో ఓట్లు పడేయడానికి వస్తున్నాడు అతని గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండకుండా వెళ్లి హైదరాబాదులో ఉంటాడని కాబట్టి అలాంటి నాయకులకు బుద్ధి చెప్పి నాకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే రామగుండం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్-లావణ్య, జాలి రాజమణి, కుసుమ, రవి నాయక్, కృష్ణ, ప్రవీణ్, బిక్షపతి, వీరన్న, సురేష్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!