భూ కేంద్రం ఒకటి వద్ద మేడే సందర్భంగా సిపిఎం బహిరంగ సభ

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 1: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో ఏర్పడ్డ భూ పోరాట కేంద్రం ఒకటిలో వెలసిన గుడిసెల వద్ద మేడే సందర్భంగా పెద్దపెల్లి జిల్లా కార్యవర్గ సభ్యురాలు మహేశ్వరి సిపిఎం జెండా ఆవిష్కరించారు. ఈ భూ పోరాట కేంద్రంలో మహేశ్వరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సిపిఎం బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా సెక్రెటరీ యాకయ్య మాట్లాడుతూ గత 45 రోజులుగా ఇంటి స్థలాల కోసం పోరాటం చేస్తున్నాము పేదవారు ఇల్లు కట్టుకోవడానికి కనీస 125 గజాల స్థలాన్ని మనం సాధించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మే డే ను ఉద్దేశించి శ్రామికుల రక్తం నుండి పుట్టిన ఎర్రజెండా ఈఎర్రజెండాపై వచ్చిన సుత్తి కొడవలి ఎలా వచ్చిందంటే రైతు కోత కోసే సమయంలో వాడేది కొడవలి కార్మికుడు పరిశ్రమలో పనికివాడే ది సుత్తి అందుకే ఎర్రజెండా పై సుత్తి కొడవలి గుర్తు మే డే స్ఫూర్తి అంటే కార్మికుల పోరాటానికి సన్నద్ధం కావడం అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి సభ్యులు ముత్యంరావు,రాజిరెడ్డి,పెద్దపల్లి కమిటీ సభ్యురాలులావన్య,పెద్దపెల్లి కమిటీ సభ్యుడు సారయ్య,పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు భూ పోరాట కేంద్రభాద్యులు సాగర్,వార్డుల వారిగా మహిళా లీడర్లు,సిపిఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *