సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతకు సీఐ జగదీష్ అవగాహన సదస్సు
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై25: సుల్తానాబాద్ షర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల యువతకు సీఐ జగదీష్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువత ఒత్తిడిని భరించలేక దూరాలవాట్లకు బానిసలుగా మారి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచిస్తూ విద్యార్థులు,యువత ఒక లక్ష్యంతో ముందుకెళ్లాలని ఆన్లైన్ మోసాలకు,నకిలీ బ్యాంక్ లోన్ అప్ లకు మోసపోవద్దని ప్రజల్లో చైతన్యం రావాలంటే యువతతోనే సాధ్యం అని అన్నారు.సోషల్ మీడియా ఎక్కువ కీడు చేస్తుందని టెక్నాలజీ ముసుగులో జరుగుతున్నా మోసాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు.ప్రతి దాంట్లో మంచి చెడులు రేమడు ఉంటాయి టెక్నాలజీని మంచికే ఉపయోగించుకొని మంచి మిత్రులతో స్నేహం చేసి దేశ అభ్యన్నతి కోసం యువత పాటుపడాలని సూచించారు. పోలీస్ ఆధ్వర్యంలో వచ్చే నెల నిర్వహించే బ్లడ్ డొనేట్ కార్యక్రమానికి అధికల సంఖ్యలో యువత పాల్గొని రక్తదానం చేసి ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడలని కోరారు.ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ఎస్ ఐ విజయేందర్ కాల్వ,శ్రీరాంపూర్ ఎస్ ఐ శ్రీనివాస్,జూలపల్లి ఎస్ ఐ వెంకటకృష్ణ,పోలీస్ సిబ్బంది,యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!