కెసిఆర్ చేతుల మీదుగా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ప్రారంభిస్తాం
స్వేచ్ఛ న్యూస్, ఏప్రిల్ 26, నార్కెట్పల్లి: బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టును వచ్చేనెల సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం నార్కట్ పల్లి మండలం బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ పనులను అధికారులతో కలసి పరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి విలేకరులతో మాట్లాడుతూ లక్ష ఎకారాలకు సాగు నీరందించే బ్రాహ్మణవెల్లంల ఎత్తి పోతల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేసుకొని సీఎం చేతుల మీదుగా ప్రాజెక్ట్ ను ప్రారంబిస్తామనన్నారు. ప్రాజెక్టు పనులకు సహకరించిన రైతులకు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కాలువలకు భూసేకరణ పనులను వీలైనంత తొందరగా పూర్తి చేసి కాలువల తవ్వకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి బిల్లులు పూర్తిస్థాయిలో మంజూరైనట్లు పేర్కొన్నారు.

Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!