పౌర హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి తైసీనుద్దీన్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఎప్రిల్ 29: పౌరా హక్కుల పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మంచిర్యాల పట్టణ ఎస్ఐ తైసినుధ్ధీన్ అన్నారు. మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అండాలమ్మా కాలనీలో ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం కాలనీ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ భారత రాజ్యాంగం భారత పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. ప్రజలు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుంది కుల వివక్ష లేకుండా సోదర భావంతో అందరూ కలిసి ఉండాలని అంటరానితనం లాంటి అమానుషమైన చర్యలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, బిసి, ఎస్సి వెల్ఫేర్ అధికారులు ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!