వ్యాపారుల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తికి వినతి


స్వేచ్చ న్యూస్, నార్కట్ పల్లి, అక్టోబర్ 14
నార్కట్ పల్లి పట్టణంలో ఉన్న వ్యాపారుల సంక్షేమానికి కృషి, చేస్తూ ఇతర రాష్ట్రాల వ్యాపారులకు నార్కట్ పల్లి పట్టణంలో అనుమతులు ఇవ్వొద్దని కోరుతూ నార్కట్ పల్లి పట్టణ వ్యాపారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నకరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు బోడ వెంకన్న మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి నార్కట్ పల్లి పట్టణంలోకి వలస వచ్చి ఇక్కడి ప్రజలను మోసం చేయడానికి, ప్రస్తుత వ్యాపారాలను దెబ్బతీసే విధంగా అత్యధిక అద్దె చెల్లిస్తామని యజమానులకు నమ్మబలికి నాసిరకం వస్తువులను అందుబాటులోకి తెచ్చి, తక్కువ ధరకు ఇస్తామంటూ వినియోగదారులను మోసం చేస్తున్నారన్నారు. మార్వాడి వ్యాపారస్తులకు పట్టణంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఇవ్వద్దని పట్టణంలో ఉన్న అందరు వ్యాపారస్తులు ఏకగ్రీవ తీర్మానము చేసినట్లు పేర్కొన్నారు. కావున ఇట్టి తీర్మానానికి బలం చేకూరుస్తూ పట్టణంలో ఇతర రాష్ట్రాల వారికి అనుమతులు ఇవ్వవద్దని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యాపార అసోసియేషన్ గౌరవ సలహాదారులు నల్లగొండ నాగరాజు, ఉపాధ్యక్షులు కొప్పు అంజన్, ప్రధాన కార్యదర్శి బోయపల్లి శ్రవణ్, కోశాధికారి కనకారావు, పసునూరిశివరాం, పల్లెర్ల నాగరాజు, సహాయ కార్యదర్శి రమేష్ రెడ్డి, కన్నెబోయిన లింగస్వామి, చొల్లేటి శ్రీనివాస్ చారి, నల్లగొండ రాంబాబు, కానుకుర్తి శ్రీనివాస్, గుంటోజు రమేష్ చారి, బొల్లం సంతోష్, సహాయ కార్యదర్శి అందోజు మహేంద్ర చారి , పల్లెర్ల సత్యనారాయణ, షణ్ముఖ చారి, తండ వెంకన్న, బుచ్చిరెడ్డి, అర్థం శ్రీనివాస్, వీర కుమార్, బెల్లీ దశరథ, కానుకుర్తి సత్యనారాయణ, శంకరాచారి, రామాచారి, తడక మల్ల ప్రసాద్, లీగల్ అడ్వైజర్లు గర్దాస్ వెంకటేశ్వర్లు, అద్దంకి శ్రీశైలం చారి, తదితరులు పాల్గొన్నారు.

Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *