ధరణి ఆపరేటర్ల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
స్వేచ్ఛ న్యూస్, హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం తెలంగాణ భవన్ లో ధరణి ఉద్యోగుల నూతన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యవర్గంలో సంగం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గా బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి రూప్ సింగ్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా TSTS ఛైర్మెన్ జగన్ రావు, BDL ఎంప్లాయిస్ ఛైర్మెన్ దానకర్ణ చారీలు హాజరయ్యారు. నూతన కార్యవర్గంలో నల్లగొండ కు చెందిన దండంపల్లి అశోక్ ని అద్యక్షులు గా, సాయిబాబా ని ఉపాధ్యక్షులుగా, ఎం అనిత ని ప్రధాన కార్యదర్శి గా, జి హిమేష్ కుమార్ ని కోశాధికారిగా, గౌరవ సలహాదారు గా CH.శ్రీధర్ ను ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి DC లు, FTS లు అన్ని జిల్లాల వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరణి ఉద్యోగుల సమస్యలైన కనీస వేతనం, నెలనెలా జీతం, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై చర్చించి ఇట్టి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం దిశ గా కృషి చేయనున్నట్లు తెలిపారు.

Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!