ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు వినతి పత్రం ఇచ్చిన కోరుకంటి
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 25: రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కళాశాల వల్ల పేద,మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందుతుందని ఇంకా ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని,ఫైవ్ ఇంక్లైన్ యు.పి.హెచ్.సి భవన నిర్మాణానికి కోటి రూపాయలు నిధులు మంజూరు చేయాలని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ గురువారం రోజున హైదరాబాదులో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావును కలిసి వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించి యు.పి.హెచ్.సి భవన నిర్మాణానికి కోటి రూపాయల మంజూరు,నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు అతి త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారని కోరికంటి చందర్ తెలిపారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!