అసెంబ్లీ ఎన్నికల్లో మహిళకు అవకాశం ఇవ్వండి సంధ్యారాణి
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 30: 2ఇంక్లైన్ కార్మికులను కలిసిన బిజెపి అభ్యర్థి సంధ్యారాణి ప్రతి కార్మికుడిని పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం నుండి ఎంతోమంది నాయకులకు అవకాశం కల్పించారని ఈసారి ఒక మహిళకు అవకాశం కల్పించండని కోరారు.నా వెనక వీలకోట్ల ఆస్తులు లేవని లీడర్లు అంతకన్నా లేరని నా బలం బలగం అంతా మీరేనని అన్నారు.భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఈ ఎన్నికల్లో వారు చేసినవి ఎక్కడ బయటపడతాయో అని గనుల వద్ద ప్రచారం నిర్వహించకుండా కార్మికులను బెదిరింపులకు గురిచేసే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. సింగరేణిలో కార్మికులను కలవకుండా బయట మాత్రమే కలవాలని ఆ ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.మీ ఇంటి ఆడబిడ్డగా ఒక మహిళగా అడుగుతున్నానని బిజెపికి ఓటు వేసి నన్ను గెలిపిస్తే నీతివంతమైన పాలన అందిస్తానని సంధ్యారాణి అన్నారు.ఈ కార్యక్రమంలో బిఎంఎస్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య వైస్ ప్రెసిడెంట్ ఆకుల హరీష్ కార్యదర్శి సాయి వేణి సతీష్ కేంద్ర ఉపాధ్యక్షులు సారంగపాణి కేంద్ర కార్యదర్శి మాదాసు రవీందర్2 ఇంక్లైన్ సెక్రటరీ పెంచల వెంకటస్వామి కార్మికులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!