రిటైర్డ్ కార్మికులకు ఉచితంగా జిమ్ చేసుకునే అవకాశం కల్పిస్తానన్న ఠాకూర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 1: ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరిఖని జవహర్ నగర్ సింగరేణి స్టేడియంలో ఉదయం వాకర్స్,జిమ్ చేసేవారితో కలిసిన రామగుండం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసి రిటైర్డ్ అయిన సింగరేణి కార్మికులు వారి ఆరోగ్యం కోసం జింకు వస్తే డబ్బులు కడితేనే జింకు అనుమతిస్తున్నారని నేను గెలిచినంక సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉచితంగా జిమ్ చేసే అవకాశం కల్పిస్తానని సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి నూతన పరికరాలు సమకూరుస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్పొరేటర్లు,వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!