నూతన ఏసిపికి పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ నాయకులు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 2: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని సబ్ డివిజన్ కు నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏసిపి)తుల శ్రీనివాసరావుకు పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలపడం జరిగిందని సిపిఐ నగర సహాయ కార్యదర్శి మధ్ధేల దినేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి బ్రిడ్జి చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఏసీపీని కోరడం జరిగిందని అన్నారు.కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల గోదావరి నది నిండుకుండలా ఉందని కొంతమంది ప్రజలు తమ కుటుంబ సమస్యల వల్ల చావే పరిష్కారం అనుకొని గోదావరి బ్రిడ్జి పైనుండి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఎసిపికి వివరించడం జరిగిందన్నారు.గోదావరి నది వద్ద ఉన్న పోలీస్ అవుట్ పోస్టు వద్ద ఉన్న పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టి ఆత్మహత్యకు పాల్పడే వారి ప్రాణాలను రక్షిస్తున్నారని అన్నారు.ప్రజల ప్రాణాలు కాపాడేందుకు బ్రిడ్జి చుట్టూ రక్షణ అవలయము ఏర్పాటు చేయాలని కోరడంతో ఏసిపి సానుకూలంగా స్పందించినట్లు మధ్ధేల దినేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు తొడుపునూరి రమేష్ కుమార్ పాల్గొన్నారు.

Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *