ప్రచారంలో దూసుకుపోతున్న గొర్రె రమేష్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 31: రామగుండం నియోజకవర్గం నుండి తెలంగాణ లేబర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ న్యాయవాది గొర్రె రమేష్ రెండవ విడత శంఖారావ ప్రచారంలో తనను గెలిపించాలని విట్టల్ నగర్ చౌరస్తా,వీర్లపల్లి,సెవన్ ఎల్ బి కాలనీలోని అత్యంత పేద ప్రజలు నివసించే ప్రాంతాలలో ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది.ఈ సందర్భంగా గొర్రె రమేష్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో పార్టీల,వ్యక్తుల,హోదాల పేర్లతో ఓట్లు అడుగుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.5 ఏళ్లు అధికారంలో ఉన్న కోరికంటి చందర్ గాని ఒక్కసారి చైర్మన్గా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న సోమవారం సత్యనారాయణ గాని మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయిన మక్కాన్సింగ్ కానీ ఈ ప్రాంత ప్రజలకు ఏమీ చేయలేదని అన్నారు. సెవెన్ ఎల్ బి కాలనీవాసులందరినీ దత్తత తీసుకొని డబ్బులు,పదవులు,అభివృద్ధి ఆశ చూపుతూ మోసం చేస్తున్నటువంటి నాయకులను ఓడించి నన్ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ శంకరావ ప్రచార కార్యక్రమంలో అల్లెపు తిరుపతి,కన్నం భానుచందర్,చెరుకు పైడి అఖిల్ వర్మ,జక్కం కవిత,పొన్నం రజిత శలిగంటి ఓదెలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!