పేద ప్రజల ఆరోగ్యం కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 9: కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న పెద్దంపేట్ గ్రామనికి చెందిన ఉప్పుల రాజమణికి రూ:125000/-,అడ్డగుంటపల్లికి చెందిన చిలారపు ఐలయ్యకు మోకళ్ళ చిచ్చకు అవసరమైన 1 లక్ష రూపాయల విలువగల ఎల్ఓసి లను రామగుండం శాసనసభ్యులు వారి నివాసాలలో అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తున్నారన్నారు.పేదలకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎత్తకుండా ప్రజల ఆరోగ్యం కోసం సి ఎం ఆర్ ఎఫ్,ఎల్ఓసిల ద్వారా కోట్లాది రూపాయలను కర్చు చేస్తున్నారని అన్నారు.ఈ క్రమంలోనే రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం సమారుగా 14 కోట్లు సిఎంఆర్ఎఫ్,ఎల్ఓసి లను అందించమన్నారు.అంతేకాకుండా నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం తాను ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీటిసి శరణ్య మధుకర్,నాయకులు అచ్చ వేణు,సదానందంతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *