మే డే స్ఫూర్తితో ఉద్యమించాలి
ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా చికాగో నగరంలోని అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి. లొడంగి శ్రవణ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 134వ మేడే దినోత్సవం సందర్భంగా సోమవారం నార్కెట్పల్లి సెంటర్లో సిపిఐ పార్టీ పథాకాన్ని సిపిఐ మండల కార్యదర్శి పెండ్యాల శంకర్ చేతుల మీదుగా ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కార్మికుల హక్కులను హరించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం అసంఘటితరంగా కార్మికులకు, వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం రూపొందించి కనీస వేతనంగా 26వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలకుల పై కార్మికుల పక్షాన కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడు పోరాడుతుందని తెలిపారు. ఈ మేడే దినోత్సవంలో సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు ఎండీ అక్బర్, వెంపటి శ్రీనివాస్, మండల నాయకులు దుబ్బ నరసింహ, శ్రీపతి స్వామి, బొరుగురి లింగయ్య, ఎస్కే షరీఫ్, మేకల బిక్షం తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!